Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాంచీ వన్డే మ్యాచ్ : న్యూజిలాండ్ 260/6.. భారత్ టార్గెట్ 261 రన్స్

భారత్‌లో న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ ప‌ర్య‌ట‌నలో భాగంగా కొన‌సాగుతున్న ఐదు వ‌న్డేల సిరీస్‌లో నాలుగో వన్డే రాంచీలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పర్యాటక జట్టు టాస్‌ గెల

Advertiesment
India set target
, బుధవారం, 26 అక్టోబరు 2016 (17:28 IST)
భారత్‌లో న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ ప‌ర్య‌ట‌నలో భాగంగా కొన‌సాగుతున్న ఐదు వ‌న్డేల సిరీస్‌లో నాలుగో వన్డే రాంచీలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పర్యాటక జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. న్యూజిలాండ్ ఓపెన‌ర్లుగా గుప్తిల్‌, లాథ‌మ్‌లు క్రీజులోకి దిగి... తొలి వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇందులో గుప్తిల్ 72, లాథన్ 39 చొప్పున పరుగులు చేశారు. 
 
అలాగే, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు విలియన్స్ 41, టేలర్ 35, నీషం 6, వాట్లింగ్ 14, డెవిచ్ 11, సత్నల్ 17, సౌథీ 9 చొప్పున పరుగులు చేయగా, 16 రన్స్ అదనపు పరుగుల రూపంలో వచ్చాయి. నిజానికి ఓపెనర్లు మార్టిన్‌ గుప్తిల్‌ (72), టామ్‌ లాథమ్‌ (39) శుభారంభం ఇవ్వగా, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (41), రాస్ టేలర్ (35) ఆకట్టుకున్నా భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. 
 
ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా రెండు వికెట్లు తీయగా, యాదవ్, కులకర్ణి, పాండ్యా, పటేల్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. కాగా, ఈ వన్డే సిరీస్‌లో భారత జట్టు ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాంచీ రాంబో.. ధోనీ రూ.43లక్షల కారులో.. కివీస్ ఆటగాళ్లు బస్సులో.. ఫోటో వైరల్..