Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేపియర్ వన్డే : న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్

నేపియర్ వన్డే : న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్
, బుధవారం, 23 జనవరి 2019 (15:11 IST)
నేపియర్ వన్డేలో భారత్ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‍లో కివీస్ జట్టు విధించిన 157 పరుగుల సునాయాస లక్ష్యాన్ని భారత ఆటగాళ్లు ఆడుతూపాడుతూ ఛేదించారు. డక్‌వర్త్ లూయిస్ పద్దతి మేరకు 85 బంతులు మిగిలివుండగానే 8 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన కివీస్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. భారత బౌలర్ల ధాటికి ఈ జట్టు కేవలం 38 ఓవర్లలో 157 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత 158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ తన వ్యక్తిగత స్కోరు 11 పరుగులు, విరాట్ కోహ్లీ 45 పరుగుల వద్ద ఔటైనప్పటికీ... మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (75 నాటౌట్), అంబటి రాయుడు (11 నాటౌట్)లు కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 
 
అంతకుముందు కివీస్ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు జూలు విదిల్చారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌ దెబ్బకు ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు కేవలం 157 పరుగులకే ఆలౌట్ అయింది. కీవీస్ జట్టును తక్కువ స్కోరుకు ఆలౌట్ చేయడంలో బౌలర్లు ప్రధానపాత్ర పోషించారు. ముఖ్యంగా, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా, మహమ్మద్ షమీ కీలకమైన మూడు వికెట్లు, చాహాల్ 2, జాదవ్‌ ఒక వికెట్ చొప్పున తీశాడు. ఫలితంగా కివీస్ జట్టు 157 పరుగులకే ఆలౌట్ అయింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టును ఆరంభంలోనే షమీ దెబ్బతీశాడు. కివీస్ సారథి కేన్ విలియమ్సన్ (64) ఒక్కడే ర్థశతకంతో రాణించగా, రాస్ టేలర్ (24) పరుగులు చేశాడు. స్టార్ ప్లేయర్స్ మార్టిన్ గుప్తిల్ (5), మున్రో (8), టామ్ లాథమ్ (11), హెన్రీ నికోల్స్ (12) నిరాశపరిచారు. 
 
పైగా, సొంత గడ్డపై గొప్ప రికార్డు కలిగిన బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో కివీస్ జట్టు కేవలం 38 ఓవర్లలోనే 157 పరుగులకే ఆలౌట్ అయింది. నిజానికి 145 పరుగుల వద్ద 6 వికెట్లతో ఉన్న జట్టు మరో 12 పరుగులు జోడించేలోపే చివరి నాలుగు వికెట్లనూ కోల్పోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూర్యకాంతి బ్యాట్స్‌మెన్ కంట్లో పడుతుందని భారత్-కివీస్ మ్యాచ్ ఆపేశారు...