Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళల ప్రపంచ కప్.. సెమీస్ అవకాశాలు క్లిష్టతరం.. మహిళా జట్టు?

మహిళల ప్రపంచ కప్.. సెమీస్ అవకాశాలు క్లిష్టతరం.. మహిళా జట్టు?
, శనివారం, 19 మార్చి 2022 (16:23 IST)
మహిళల ప్రపంచ కప్‌లో టీమిండియా మహిళా జట్టు సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో గెలవాల్సిందిపోయి.. ఓటమిని చవిచూసింది. 
 
దీంతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసింది. మిథాలీరాజ్ (68), యస్తికా భాటియా (59), హర్మన్ ప్రీత్‌కౌర్ (57 నాటౌట్), పూజా వస్త్రాకర్ (34) రాణించారు.
 
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆసీస్ 49.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది విజయం సాధించింది.  ఈ ఓటమితో టీమిండియా సెమీస్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి.
 
ఒకవేళ సెమీస్‌కు వెళ్లాలంటే తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో భారత్ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. మంగళవారం బంగ్లాదేశ్, ఆదివారం సౌతాఫ్రికాతో విజయం సాధించాలి. 
 
అంతేకాదు న్యూజిలాండ్ తన తదుపరి మ్యాచ్‌లో ఓడిపోవాలి. ఇలా జరిగితేనే మనం సెమీస్‌ అవకాశాలు భారత్‌కు వుంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయాల్లోకి అంబటి రాయుడు.. ఏ పార్టీ ఆఫర్ ఇచ్చిందో?