Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కివీస్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ కీలకం.. చివరకు బ్యాటింగ్ చేయాలి ... : చోప్రా

కివీస్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ కీలకం.. చివరకు బ్యాటింగ్ చేయాలి ... : చోప్రా
, ఆదివారం, 31 అక్టోబరు 2021 (15:03 IST)
ఐసీసీ ట్వంటీ20 టోర్నీలోభాగంగా, ఆదివారం రాత్రి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లూ సన్నద్ధమయ్యాయి. పైగా, ఇరు జట్లూ ఆడిన తమతమ తొలి మ్యాచ్‌లలో ఓడిపోయాయి. దీంతో ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. 
 
ఇదిలావుంటే, ప్రపంచకప్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన భారత్‌ మరింత పట్టుదలగా కనిపిస్తోంది. దీనిపై మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా మాట్లాడాడు. భారత జట్టులో ఎక్స్‌ ఫ్యాక్టర్‌ రిషభ్ పంత్‌ అని, అతను భారత ఇన్నింగ్స్ చివరి వరకూ బ్యాటింగ్ చేయాలని ఆకాశ్‌ అభిప్రాయపడ్డాడు.
 
‘పాండ్యా ఫామ్‌లో లేడు. అతను ఫామ్‌లోకి రావాలని మనమంతా కోరుకుంటున్నాం. కానీ డెత్‌ ఓవర్లలో బ్యాటింగ్ చేయాలంటే పంత్‌ కన్నా బెటర్‌ ఆప్షన్ మరొకటి లేదు’ అని అతను చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమీతుమీ తేల్చుకోనున్న భారత్ - కివీస్: కోహ్లీ సేనకు పరీక్షే!