Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'డెంగ్యూ’తో హైదరాబాద్ యువ క్రికెటర్ సాయినాథ్ మృతి

హైదరాబాద్ నగరంలో డెంగ్యూ జ్వరం విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు నగర వాసులు మృత్యువాతపడ్డారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన యువ క్రికెటర్ సాయినాథ్ మృతి ప్రాణాలు కోల్పోయాడు.

'డెంగ్యూ’తో హైదరాబాద్ యువ క్రికెటర్ సాయినాథ్ మృతి
, శనివారం, 17 సెప్టెంబరు 2016 (10:29 IST)
హైదరాబాద్ నగరంలో డెంగ్యూ జ్వరం విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు నగర వాసులు మృత్యువాతపడ్డారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన యువ క్రికెటర్ సాయినాథ్ మృతి ప్రాణాలు కోల్పోయాడు. 
 
బోడుప్పల్‌‌లోని శ్రీసాయినగర్ కాలనీకి చెందిన సాయినాథ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) అండర్-19 జట్టులో సభ్యుడు. మూడురోజుల క్రితం అతనికి జ్వరం రావడంతో ఉప్పల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు.
 
ఈ విషయం తెలుసుకున్న అతని బంధువులు, మిత్రులు బోడుప్పల్ చేరుకున్నారు. శ్రీసాయినగర్ కాలనీ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, ఈ విషయమై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆ ప్రాంతవాసులు ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా ఫేవరేట్ కెప్టెన్లలో కోహ్లీ ఒకడు.. భారత క్రికెట్‌కు విరాట్ గొప్ప ఆస్తి: బెంగాల్ దాదా