భారతలో పని చేసేది స్పిన్ మంత్రమే: ఆసీస్కి ఘోర పరాజయం తప్పదన్న గంగూలీ
భారతలో పని చేసేది స్పిన్ మంత్రమే కాబట్టి ఈ నెల చివరినుంచి జరిగే టెస్ట్ సీరీస్లో టీమ్ ఆస్ట్రేలియాకు ఘోర పరాజయం తప్పదని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. పటిష్టమైన స్పిన్ బౌలింగ్ కారణంగానే 2012 నుంచి స్వదేశంలో టీమిండియాకు
భారతలో పని చేసేది స్పిన్ మంత్రమే కాబట్టి ఈ నెల చివరినుంచి జరిగే టెస్ట్ సీరీస్లో టీమ్ ఆస్ట్రేలియాకు ఘోర పరాజయం తప్పదని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. పటిష్టమైన స్పిన్ బౌలింగ్ కారణంగానే 2012 నుంచి స్వదేశంలో టీమిండియాకు ఎదురులేకుండా పోయిందని గంగూలీ చెప్పాడు. ‘మిశ్రాకు బంతిని ఇస్తే.. అతను మ్యాచ్ విన్నర్ అవుతున్నాడు. కొత్తగా చాహల్, జయంత్ యాదవ్లకు బంతినిస్తే వాళ్లు కూడా గెలిపించేస్తున్నారు. భారతలో పని చేస్తుంది స్పిన్ మంత్రమేన’ని దాదా అన్నాడు.
భారత్లో ఆస్ట్రేలియాకు గడ్డు కాలమేనని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. కంగారూలు వైట్వాష్కు గురైనా తానేమీ ఆశ్చర్యపోనని అన్నాడు. ఈ నెల 23 నుంచి భారతలో ఆస్ట్రేలియా పర్యటన మొదలు కానుంది. ‘ఆసీస్కు కష్ట కాలమే. స్మిత సేన 0-4తో ఓడినా పెద్దగా ఆశ్చర్యపడన’ని గంగూలీ అన్నాడు.
విరాట్ కోహ్లీ అద్భుత బ్యాట్స్మన్ అని గంగూలీ కితాబిచ్చాడు. కోహ్లీ ఫిట్నెస్ అమోఘం అని చెప్పాడు. విరాట్ కెప్టెన్సీలో టీమిండియా సరికొత్త స్థాయికి చేరుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు.