Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం భారత్‌లోనే...

మొతేరా ప్రాంతంలో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పరిమళ్ నథ్వాని ఇతర ఆఫీసు సిబ్బందితో కలిసి కొత్త క్రికెట్ స్టేడియంకి శంకుస్థాపన చేశారు.

Advertiesment
world’s
హైదరాబాద్ , మంగళవారం, 17 జనవరి 2017 (02:47 IST)
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంకి సోమవారం శంకుస్థాపన చేశారు. గుజరాత్ రాష్ట్రం అహమ్మదాబాద్ లోని మొతేరా ప్రాంతంలో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పరిమళ్ నథ్వాని ఇతర ఆఫీసు సిబ్బందితో కలిసి కొత్త క్రికెట్ స్టేడియంకి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే అక్కడ ఉన్న సర్దార్ పటేల్ స్టేడియం స్థానంలో ఈ అతిపెద్ద స్టేడియం నిర్మించనున్నారు. ఈ భారీ స్టేడియం నిర్మాణానికి దాదాపు 700 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా. పాత సర్దార్ పటేల్ గుజరాత్ స్టేడియం స్థానంలో కొత్త స్టేడియంని రెండేళ్లలో నిర్మిస్తామని నథ్వాని తెలిపారు. 
 
మోతేరాలో నిర్మిచనున్న ఈ కొత్త స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అని దీని సీటింగ్ సామర్థ్యం 1.10 లక్షల మేరకు ఉంటుందని తెలిపారు. ఇంతవరకు ప్రపంచంలో అతి పెద్ద స్టేడియంగా మెల్‌బోర్న్ స్టేడియంలో 90 వేలమంది మాత్రమే పడతారని చెప్పారు. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం నిర్మించిన సంస్థే గుజరాత్‌లో ఈ భారీ స్టేడియంని నిర్మించనుందని తెలిపారు. 
 
54 వేలమంది ప్రేక్షకులు కూర్చొనగలిగే సర్దార్ పటేల్  స్టేడియంని ఇటీవలే కూల్చి వేశారు.
 
ఈ కొత్త ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 700 కోట్లు. స్టేడియంలో 76 కార్పొరేట్ బాక్సులు, 4 డ్రెస్సింగ్ రూమ్‌లు, ఒక క్లబ్ హౌస్, ఒక ఒలింపిక్ సైజ్ ఈత కొలను ఉంటాయని నత్వాని చెప్పారు. టెండర్ ప్రక్రియలో ఇంజనీరింగ్ సంస్థ ఎల్&టి ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను దక్కించుకుంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సచిన్ టెండూల్కర్‌లా నేనుండను... విరాట్ కోహ్లి షాకింగ్ కామెంట్...