Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rawalpindi: రావల్పిండి క్రికెట్ స్టేడియంలో డ్రోన్ దాడి.. క్రికెటర్లు షాక్

Advertiesment
Rawalpindi

సెల్వి

, గురువారం, 8 మే 2025 (21:02 IST)
Rawalpindi
రావల్పిండి క్రికెట్ స్టేడియంలో గురువారం జరగాల్సిన పెషావర్ జల్మి, కరాచీ కింగ్స్ మధ్య జరగాల్సిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్‌ రద్దు అయ్యింది. రావల్పిండితో సహా పాకిస్తాన్‌లోని అనేక ప్రదేశాలలో భారత సాయుధ దళాలు ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్న తర్వాత ఈ మ్యాచ్‌లను రద్దు చేశారు. పీఎస్ఎల్ మిగిలిన అన్ని మ్యాచ్‌లను విదేశాలకు - దోహా లేదా దుబాయ్‌కి మార్చాలని పీసీబీ అధికారులు సూచించారు.
 
భారత్ పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్ ఉండే రావల్పిండిపై డ్రోన్ దాడులు జరిగాయి. డ్రోన్ దాడి తర్వాత రావల్పిండిలో జరగాల్సిన పీఎస్ఎల్ మ్యాచ్ రద్దు చేయబడింది. దీంతో విదేశీ ఆటగాళ్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. చాలామంది ఇప్పుడు వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని చూస్తున్నారు. 
 
రావల్పిండి క్రికెట్ స్టేడియం వద్ద ఓ డ్రోన్ కూలిపోయినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో స్టేడియం కొంత మేర దెబ్బతిన్నట్టు సమాచారం. ఈ దాడిలో ఇద్దరు గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Sania Mirza: ఆపరేషన్ సింధూర్.. సానియా మీర్జా సందేశం