Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రికెటర్లపై సినిమాలు తీయాల్సిన అవసరం లేదు: గౌతం గంభీర్

ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఈసారి బయోపిక్‌ల పడ్డాడు. క్రికెటర్లపై సినిమాలు తీయాల్సిన అవసరం లేదంటూ గౌతం గంభీర్ అన్నాడు. క్రికెటర్ల కంటే దేశం కోసం త్యాగాలు చేసిన వారు, గొప్ప

క్రికెటర్లపై సినిమాలు తీయాల్సిన అవసరం లేదు: గౌతం గంభీర్
, సోమవారం, 19 సెప్టెంబరు 2016 (10:59 IST)
ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఈసారి బయోపిక్‌ల పడ్డాడు. క్రికెటర్లపై సినిమాలు తీయాల్సిన అవసరం లేదంటూ గౌతం గంభీర్ అన్నాడు. క్రికెటర్ల కంటే దేశం కోసం త్యాగాలు చేసిన వారు, గొప్ప పనులు చేసిన వారు ఎందరో ఉన్నారని గంభీర్ వెల్లడించాడు. వారిపై సినిమాలు తీయాల్సిందిపోయి.. క్రికెటర్లపై సినిమాలు తీయాల్సిన అవసరం లేదని గంభీర్ వెల్లడించారు. 
 
క్రికెటర్ల జీవితంపై సినిమాలు తీసే అంశంపై తనకు నమ్మకం లేదంటూ నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడించి చర్చకు తెరలేపాడు. ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ''ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ'' విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
గతంలో టీమిండియాకు అనిల్ కుంబ్లేని కోచ్‌గా ఎంపిక చేసి తప్పు చేశారంటూ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలకు క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు సౌరవ్ గంగూలీ ఘాటు వ్యాఖ్యలతో కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో నీకన్నా పెద్ద పిచ్చోడు ఉండడు అంటూ రవిని ఉద్దేశించి గంగూలీ కామెంట్స్ చేయడం జరిగింది. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ రవిశాస్త్రిపై మాటల తూటాలు పేల్చాడు. ‘‘అసలు 18 నెలల పాటు జట్టు డైరెక్టర్ గా ఉండి ఏం సాధించారో చెప్పండి’’ అంటూ రవిని నిలదీసిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత జవాన్లపై దాడి.. బాక్సర్ విజేందర్ ఘాటు వ్యాఖ్యలు.. ట్విట్టర్లో ఫైర్