Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా దేశాన్ని ఎలాగైనా ఉగ్రవాదుల చెర నుంచి కాపాడాలి.. రషీద్ ఖాన్

Advertiesment
Cricketer
, బుధవారం, 11 ఆగస్టు 2021 (20:26 IST)
ఆప్ఘనిస్థాన్‌లోని 400 జిల్లాల్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. వారి చేష్టలకు అడ్డుపడేవారే లేరని చెప్పాలి. ఇక ఈ నెల 31 లోపు అమెరికా తన పూర్తి సైన్యాన్ని వెనక్కు రప్పించే దిశగా ఆలోచిస్తోంది. అదే జరిగితే తాలిబన్ల చేతుల్లో ఆ దేశం విలవిలలాడి పోవాల్సిందే నని తెలుస్తోంది. ఇక ఈ సందర్భంలో ఆఫ్గనిస్తాన్ స్టార్‌ క్రికెటర్ రషీద్ ఖాన్ ప్రపంచ దేశాలను విజ్ఞప్తి చేస్తున్నాడు.
 
తన దేశాన్ని ఎలాగైనా ఉగ్రవాదుల చెర నుంచి కాపాడాలని వేడుకుంటున్నాడు. ప్రస్తుతం తమ దేశంలో శాంతి భద్రతలు లేవని తాలిబన్లు ఇష్టారీతిన మారణ హోమం సృష్టిస్తున్నారంటూ వాపోయాడు. 
 
కాబట్టి మళ్లీ తన దేశాన్ని శాంతి యుతంగా మార్చాలని కోరుతున్నాడు. ఆక ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు కాస్త ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన చేసిన రిక్వెస్ట్‌కు ఎవరైనా స్పందిస్తారో లేదో అన్ని మాత్రం చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాదంలో చిక్కుకున్న స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్