హోటల్లో పాత నోట్లిస్తే తిరిగి ఇచ్చేశారు.. నోట్లపై సంతకం చేయాలనుకున్నా: కోహ్లీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వాగతించాడు. ఇంగ్లండ్తో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు వైజాగ్ వచ్చిన కోహ్లి బుధవ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వాగతించాడు. ఇంగ్లండ్తో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు వైజాగ్ వచ్చిన కోహ్లి బుధవారం మీడియాతో మాట్లాడుతూ, భారత రాజకీయ చరిత్రలోనే ఇది గొప్ప ముందడుగు అని పేర్కొన్నాడు. దేశ రాజకీయ చరిత్రలో ఇంతటి గొప్ప నిర్ణయాన్ని ఇప్పటిదాకా చూడలేదన్నాడు. పెద్ద నోట్లను రద్దు చేయడం తానను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇదంతా నమ్మలేకుండా ఉన్నామని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసుకున్న సరదా సన్నివేశాన్ని మీడియాతో పంచుకున్నాడు. ''రాజ్ కోట్లో హోటల్ బిల్లు చెల్లించడానికి పాత పెద్ద నోట్లు ఇచ్చాను. అవి చెల్లవన్న విషయం మర్చిపోయాను. వీటిని తిరిగిచ్చేయడంతో నోట్లపై సంతకం చేయాలని అభిమానులు అడుగుతున్నారేమో అనుకున్నాను. తర్వాతే పెద్ద నోట్ల రద్దు విషయం గుర్తుకువచ్చింద'ని కోహ్లీ తెలిపాడు.