Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్కాట్లాండ్‌పై అష్టకష్టాలతో గెలిచిన న్యూజిలాండ్!

Advertiesment
Cricket
, మంగళవారం, 17 ఫిబ్రవరి 2015 (18:19 IST)
స్కాట్లాండ్‌పై న్యూజిలాండ్ అష్టకష్టాలతో గెలుపును నమోదు చేసుకుంది. వరల్డ్ కప్ మెగా టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన క్రికెట్ పసికూనలు ప్రధాన జట్లకు పగటి పూటే చుక్కలు చూపిస్తున్నాయి. నిన్నటికి నిన్న గ్రూపు బిలో వెస్టిండీస్‌స్‌ను ఐర్లాండ్ జట్టు చిత్తు చేసింది.

అలాగే, మంగళవారం న్యూజిలాండ్ జట్టుకు స్కాట్లాండ్ బౌలర్లు ముచ్చెమటలు పోయించారు. 143 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన కివీస్ ఆటగాళ్లు ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయారు. స్కాట్లాండ్ బౌలర్లు కివీస్ బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తిచారు.
 
మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన స్కాట్లాండ్ బ్యాటింగ్‌కు దిగింది. తన 50 ఓవర్ల కోటాను పూర్తి చేయకముందే.. 36.2 ఓవర్లలో ఆ జట్టు 142 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత 143 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో... కివీస్ జట్టు 24.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు చివర్లో స్వల్ప వ్యవధిలో 4 వికెట్లు చేజార్చుకుంది. 
 
లక్ష్యం పెద్దది కాకపోవడంతో కివీస్ జట్టు బతికిపోయింది. కివీస్ ఇన్నింగ్స్‌లో కేన్ విలియమ్సన్ (38) టాప్ స్కోరర్. ఇలియట్ 29 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా బరిలో దిగిన కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ 15 పరుగులతో నిరాశపరిచాడు. స్కాట్లాండ్ బౌలర్లలో వార్డ్ లా, డేవీ చెరో 3 వికెట్లు తీశారు. స్కాటిష్ జట్టును ఆరంభంలో హడలెత్తించిన కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. 

Share this Story:

Follow Webdunia telugu