Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హస్తిన పీఠాన్ని అధిరోహించాలనివుంది : గౌతం గంభీర్

హస్తిన పీఠాన్ని అధిరోహించాలనివుంది : గౌతం గంభీర్
, ఆదివారం, 6 అక్టోబరు 2019 (11:13 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రస్తుతం రాజకీయ నేతగా మారిపోయారు. భారత క్రికెట్ జట్టుకు ఒంటి చేత్తో ఎన్నో విజయాలను చేకూర్చి పెట్టిన ఈ ఢిల్లీ ఎడం చేతి ఓపెనర్ గౌతం గంభీర్ ఇపుడు ఫక్తు రాజకీయ నేత అయ్యారు. ఆయన బీజేపీ తరపున ఎంపీగా కూడా పోటీ చేసి విజయం సాధించారు. 
 
ఈ నేపథ్యంలో తన మనసులోని మాటను వెల్లడించారు. తనకు ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ఉందని చెప్పుకొచ్చారు. అది జరిగితే తన కల నెరవేరినట్టేనని వెల్లడించాడు. 'ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం గొప్ప గౌరవం. అతి పెద్ద బాధ్యత కూడా. అదే జరిగితే నా కల నెరవేరినట్టే' అని శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్‌ తెలిపాడు. 
 
ఇక.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై గంభీర్‌ మరోసారి విమర్శలు గుప్పించాడు. గుంతలు తేలిన ఢిల్లీ రహదారులను తక్షణమే బాగు చేయనున్నట్టు కేజ్రీవాల్‌ చేసిన ప్రకటనపై తనదైనశైలిలో వ్యంగ్యోక్తులు విసిరాడు. ఈ సందర్భంగా ప్రఖ్యాత హిందీ పాట 'బాబూజీ ధీరే చల్నా'ను ఉటంకిస్తూ 'ఢిల్లీ రోడ్లులు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. అందువల్ల నెమ్మదిగా వెళ్లండి' అని గంభీర్‌ సెటైర్లు వేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైజాగ్ టెస్ట్ : రెండో టెస్టులోనూ రోహిత్ 'హిట్'.. భారీ స్కోరు దిశగా...