Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోహ్లీ - అనుష్క మళ్లీ ఒక్కటయ్యారా? కోహ్లీతో డిన్నర్.. ఆ తర్వాత... ?

Advertiesment
Anushka Sharma
, శనివారం, 21 మే 2016 (15:57 IST)
ఇండియ‌న్ స్టార్‌ క్రికెటర్ విరాట్ కొహ్లీ, హీరోయిన్ అనుష్కా శర్మల లవ్ బ్రేకప్ న్యూస్ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు మూడేళ్లుగా వీరిద్ద‌రి మ‌ధ్య సాగిన ప్రేమ ఇంత‌లో ఉన్నట్టుండి ఏమైందో తెలియ‌దు కాని బ్రేక‌ప్ అయ్యింది. కాగా ఎంతోకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ప్రేమ పావురాలు విరాట్ కోహ్లీ, హీరోయిన్ అనుష్క శర్మల తిరిగి కలిశారనే వార్తలు బాలీవుడ్‌లో గుప్పుమంటున్నాయి. ఇటీవల వీరిద్దరూ కలిసి బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌లో దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
పూర్తి వివరాలకోసం.. గుజరాత్‌ లయన్స్‌పై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు విజయం సాధించిన అనంతరం బెంగళూరులోని ప్రముఖ జపనీస్‌ రెస్టారెంట్లో ఆర్‌సీబీ జట్టుతో ఆటగాళ్లతో కలిసి అనుష్క హోటలుకు వెళ్లి భోజనం చేయడం, తన ప్రియుడు కోహ్లీతో కొంతసేపు గడపడం అందరికి షాక్ కలిగిస్తుంది. కాగా, వీరిద్దరూ తిరిగి కలిశారని, వారి మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తోందని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. దీంతో విరాట్‌, అనుష్క ప్రేమ కొనసాగుతోందని అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరియా షరపోవా శకం ముగిసినట్టేనా.. రష్యా టెన్నిస్ ఫెడరేషన్ చీఫ్ ఏమంటున్నారు?