Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టెస్టు ర్యాంకింగ్ గోవిందా..? కోహ్లీ సారథ్యంలో విండీస్‌ గడ్డపై ర్యాంకు దిగజారేనా?

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్రథమ స్థానంలో ఉండగా, పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం భారత జట్టు 112 రేటింగ్ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, పాకిస్తాన్ 111 పాయింట

టెస్టు ర్యాంకింగ్ గోవిందా..? కోహ్లీ సారథ్యంలో విండీస్‌ గడ్డపై ర్యాంకు దిగజారేనా?
, ఆదివారం, 21 ఆగస్టు 2016 (16:07 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్రథమ స్థానంలో ఉండగా, పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం భారత జట్టు 112 రేటింగ్ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, పాకిస్తాన్ 111 పాయింట్లతో  రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో గతవారం అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్ వన్గా నిలిచిన విరాట్ నేతృత్వంలోని టీమిండియా తన ర్యాంకును కోల్పోయే పరిస్థితికి వచ్చింది. విండీస్ గడ్డపై నాలుగు టెస్టుల సిరీస్‌లో చివరి టెస్టుకు వరుణుడు అంతరాయం కలిగించడంతో టీమిండియా తన ర్యాంకును చేజార్చుకునే అవకాశం ఉంది.
 
అయితే విండీస్తో నాల్గో టెస్టులో విజయం సాధిస్తేనే టీమిండియా ర్యాంకు పదిలంగా ఉంటుంది. ఒకవేళ మ్యాచ్ డ్రాగా ముగిస్తే మాత్రం భారత ర్యాంకు కిందికి పడిపోతుంది. ఇప్పటికే మూడు రోజుల ఆట వర్షార్పణం కావడంతో టీమిండియా నంబర్ ర్యాంకుకు ముప్పుగా మారింది. ఇక రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ సిరీస్ను 3-0 తో గెలిస్తేనే టీమిండియా నెంబర్ ర్యాంకు నిలుస్తుంది. ఒకవేళ మ్యాచ్ డ్రాగా ముగిస్తే మాత్రం పాకిస్తాన్ ప్రథమ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింధు కులం గురించే గూగుల్‌లో ఎక్కువ మంది వెతికారంట.. సింధు పేరు చెబితే.. పిజ్జా ఫ్రీ!