Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

24 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై ఆసీస్ విజయం.. హైలైట్స్

24 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై ఆసీస్ విజయం.. హైలైట్స్
, శుక్రవారం, 25 మార్చి 2022 (22:06 IST)
Pakistan
పాకిస్థాన్ గడ్డపై ఆస్ట్రేలియా సిరీస్ గెలుపును నమోదు చేసుకుంది. 24 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై ఆస్ట్రేలియా విజయాన్ని అందుకుంది. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో పాకిస్థాన్‌ను మట్టికరిపించి 1-0తో సిరీస్ కైవసం చేసుకుంది. గతంలో రిచీ బెనాడ్ (1959-60) సారథ్యంలో, 1998-99 ఏట మార్క్ టేలర్ కెప్టెన్సీలో, తాజాగా 2021-22లో పాట్ కమిన్స్ సారథ్యంలో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ నెగ్గింది.  
 
ఆద్యంతం రసవత్తరంగా సాగిన మూడో టెస్ట్‌లో ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆసీస్ 115 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలి రెండు టెస్ట్‌లు ఫలితం లేకుండా ముగియడంతో సిరీస్ ఆసీస్ సొంతమైంది. 8 వికెట్లతో చెలరేగిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (5/56, 3/23)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. సిరీస్‌లో సెంచరీల మోత మోగించిన ఉస్మాన్ ఖవాజా(496)కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వరించింది.
 
351 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే కుప్పకూలింది. ఈ  మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌటైంది. అనంతరం పాకిస్థాన్ 235 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 227/3 స్కోర్ వద్ద డిక్లెర్ ఇచ్చింది.
 
ఆసీస్ -పాక్ టెస్టు సిరీస్‌లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్లు 
496 - ఉస్మాన్ ఖవాజా (యావరేజ్ 165.33)
397 - అబ్ధుల్లా షఫీఖ్  (79.40)
390 - బాబర్ ఆజామ్ (78.00)
370 - ఇమామ్-ఉల్ -హక్ (74.00)
300 - హజర్ అలి (60.00)
 
పాక్-ఆసీస్ టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు 
12 - పాట్ కమిన్స్ (22.50)
12 - నాథన్ లియోన్  (యావరేజ్ 44.83)
9 - షహీన్ షా అఫ్రిది (36.44)
9 - నౌమన్ అలీ (42.22)
8 - మిట్చెల్ స్టార్క్  (34.12)

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2022 పివ్యూ: తొలి పోరుకు చెన్నై సిద్ధం.. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా..?