Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జింబాబ్వే పర్యటనలో భారత్‌కు తొలి షాక్.. టీ-20 మ్యాచ్‌లో ధోనీ గ్యాంగ్‌కు చుక్కెదురు!

జింబాబ్వే పర్యటనలో భారత్‌కు తొలి ట్వంటీ-20లో షాక్ తగిలింది. వన్డే సిరీస్‌ను ఏకపక్షంగా సొంతం చేసుకున్న భారత జట్టుకు జింబాబ్వే ఆటగాళ్లు తొలి ట్వంటీ-20లో చుక్కలు చూపించారు. 171 పరుగుల లక్ష్యాన్ని చేధించే

Advertiesment
Chigumbura 54
, ఆదివారం, 19 జూన్ 2016 (11:49 IST)
జింబాబ్వే పర్యటనలో భారత్‌కు తొలి ట్వంటీ-20లో షాక్ తగిలింది. వన్డే సిరీస్‌ను ఏకపక్షంగా సొంతం చేసుకున్న భారత జట్టుకు జింబాబ్వే ఆటగాళ్లు తొలి ట్వంటీ-20లో చుక్కలు చూపించారు. 171 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ధోనీసేన తడబడటంతో జింబాబ్వే విజయకేతనం ఎగురవేసింది. నిర్ణీత 20 ఓవర్ల ధోనీసేన 168 పరుగులే సాధించి రెండు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. విజయానికి చివరి ఓవర్‌లో ఎనిమిది పరుగులు అవసరమవగా, పేసర్ నెవిల్ మద్జివా ఐదు పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. 
 
ప్రపంచ అత్యుత్తమ ఫినిషర్‌గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోనీ.. అనుభవం లేని మద్జీవా బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కోలేకపోవడం ద్వారా మ్యాచ్‌కు ముగింపు ఇవ్వలేకపోయాడు. భారత జట్టులో మనీశ్‌పాండే(35 బంతుల్లో 48), మన్‌దీప్‌సింగ్(27 బంతుల్లో 31,) రాణించగా, ధోనీ(19 నాటౌట్), జాదవ్(19), రాయుడు(19), అక్షర్(18) పర్వాలేదనిపించారు. 
 
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. ఎల్టన్ చిగుంబరా(26 బంతుల్లో 54 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీకి కీపర్ వాలర్(30) మసకద్జా(25)ల స్కోరు జతకావడంతో 20 ఓవర్లలో జింబాబ్వే ఆరువికెట్లు కోల్పోయి 170 పరుగుల భారీస్కోరు చేసింది. చిగుంబరాకు మ్యాన్ ఆఫ్‌ద మ్యాచ్ దక్కింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి భారత్ : 36 సంవత్సరాల తర్వాత కొత్త రికార్డు