Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా రోగి ఆస్పత్రికి... దొంగలు ఆ ఇంట్లో చొరబడి చపాతీలు, మటన్ లాగించి....?

కరోనా రోగి ఆస్పత్రికి... దొంగలు ఆ ఇంట్లో చొరబడి చపాతీలు, మటన్ లాగించి....?
, ఆదివారం, 19 జులై 2020 (17:41 IST)
Mutton Chappathi
కరోనా కేసులు అధికంగా వున్న ప్రాంతాలను కంటైన్మైంట్ జోన్‌గా ప్రభుత్వాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతాలు నిర్మానుష్యంగా వుండటం.. ప్రజలు అధికంగా సంచరించకపోవడం వంటివి అకృత్యాలకు పాల్పడేవారికి బాగా కలిసొచ్చేలా చేసింది. ఇలాంటి ప్రదేశాల్లో దొంగలు బాగా దోచేసుకుంటున్నారు. జార్ఖండ్‌లో ఇలా ఇళ్లల్లో పడి దోచుకునే నేరాలు పెరిగిపోతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఓ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు అధికారులు. అక్కడ కరోనా సోకిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించడంతో.. అతడి భార్య, పిల్లల్ని తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇక, అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు. 
 
నెల రోజులుగా ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. అదే అదునుగా భావించిన దొంగలు.. ప్లాన్ చేసుకుని ఆ ఇంట్లోకి చొరబడ్డారు.. అది కంటైన్మెంట్ జోన్ కూడా కావడంతో దొంగలు రెచ్చిపోయారు. ఆ ఇంట్లో రాత్రి మటన్ కర్రీ, చపాతీలు.. ఇలా వంట చేసి విందు చేసుకున్నారు.
 
ఆ తర్వాత ఇంట్లో ఉన్న రూ.50 వేలు, దొరికినకాడికి నగలు దోచుకుని పారిపోయారు. కానీ ఆ ఇంటిని చూసొద్దామని కరోనా రోగి సోదరుడు వెళ్తే.. అతడు ఖంగుతిన్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫైరింజన్‌ బోల్తా- రేణిగుంట విమానాశ్రయంలో తృటిలో తప్పిన ప్రమాదం