Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంగ్లాదేశ్‌లో కరోనా కేసులు... మోడీ పర్యటన రద్దు

బంగ్లాదేశ్‌లో కరోనా కేసులు... మోడీ పర్యటన రద్దు
, సోమవారం, 9 మార్చి 2020 (08:51 IST)
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే అనేక దేశాలకు వ్యాపించిన ఈ వైరస్.. తాజాగా బంగ్లాదేశ్‌లో కూడా అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌లో తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ తన బంగ్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. 
 
బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ శతాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల 17వ తేదీన మోడీ ఢాకాకు వెళ్లాల్సివుంది. కానీ, తాజాగా ఆ దేశంలో మూడు కరోనా కేసులు నమోదు కావడంతో ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
 
ఇటలీ నుంచి వచ్చిన ఇద్దరు బంగ్లాదేశీయులకు జరిపిన పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. ఈ నేపథ్యంలో శత జయంతి వేడుకలను వాయిదా వేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఈ మేరకు ఉత్సవ కమిటీ ఛైర్మన్ అబ్దుల్ చౌదరి తెలిపారు. కాగా, ఈ నెల 13న బ్రసెల్స్‌లోని ఈయూ కార్యాలయంలో నిర్వహించనున్న ఇండో-ఈయూ సదస్సుకు కూడా మోడీ హాజరు కావాల్సి ఉన్నా.. ఆ పర్యటనను కూడా రద్దు చేసుకున్న విషయం తెల్సిందే. ఇదే విధంగా పలు దేశాధినేతల పర్యటనలు కూడా కరోనా దెబ్బకు రద్దు అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాయ్‌ఫ్రెండ్‌తో బెడ్‌పై రసపట్టులో బాలిక... తలుపు కొట్టిన తల్లి... ఆ తర్వాత..