Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెసిడెన్షియల్ కళాశాలలో 56 మందికి కరోనా పాజిటివ్, ఇంటికి పంపేశారు, వామ్మో?

రెసిడెన్షియల్ కళాశాలలో 56 మందికి కరోనా పాజిటివ్, ఇంటికి పంపేశారు, వామ్మో?
, శుక్రవారం, 3 డిశెంబరు 2021 (20:55 IST)
కరోనా మహమ్మారి గురించి తెలియనిది కాదు. ఆ వైరస్ సోకితే సదరు వ్యాధిగ్రస్తుడిని వెంటనే ఐసోలేషన్లో వుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఓ కళాశాల నిర్వాకంతో కళాశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో పడిపోయారు. ఇంతకీ ఏం జరిగిందయా అంటే...

 
ఒడిశాలోని ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీకి చెందిన 270 మందికి కరోనా పరీక్షలు చేసారు. వారిలో 56 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో కళాశాల యాజమాన్యం వారందరినీ ఐసోలేషన్లో వుంచకుండా నేరుగా వారివారి ఇళ్లకు పంపేసింది.దీనితో వారి తల్లిదండ్రుల షాక్ తిన్నారు.

 
బుధవారం నాటి 33 సంఖ్యతో కలిపి, గురువారం సాయి కృపా రెసిడెన్షియల్ కాలేజీ విద్యార్థులలో మరో 19 కోవిడ్ కేసులు వెలుగుచూసాయి. గత వారం నలుగురు విద్యార్థులకు వైరస్‌ సోకింది. దీన్ని జిల్లా అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. విద్యార్థులను ఐసోలేషన్లో వుంచకుండా ఇలా ఇంటికి పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు జిల్లా అధికారులు. కేసు నమోదు చేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దారుణం, శ్రీలంక పౌరుడిపై పాకిస్తాన్‌లో మూకదాడి, చంపి పెట్రోల్ పోసి...