Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహారాష్ట్రలో 215 మంది పోలీసులకు కరోనా.. దేశంలో 776 మంది మృతి

Advertiesment
మహారాష్ట్రలో 215 మంది పోలీసులకు కరోనా.. దేశంలో 776 మంది మృతి
, మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (14:54 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా పోలీసులే అధికంగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. నిత్యం వందలాది పోలీసులు కరోనా బారినపడుతున్నారు. సోమవారం నుంచి మంగళవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 215 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో వైరస్ సోకిన పోలీసుల సంఖ్య 23,033కు చేరింది. ఇందులో 19,681 మంది కోలుకోగా ప్రస్తుతం 3,107 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
మరోవైపు కరోనాతో ఇప్పటి వరకు 245 మంది కాప్స్ మరణించారు. కరోనా కేసులు, మృతుల పరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.35 లక్షలు దాటగా 35 వేల మందికిపైగా మరణించారు.
 
మరోవైపు దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 70,589 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 61 లక్షల 45 వేలకు చేరింది. 
 
గడిచిన 24 గంటలలో దేశంలో కరోనా కారణంగా మొత్తం 776 మంది మృతి చెందగా.. దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 84,877 డిశ్ఛార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 96,318 మృతి చెందగా.. మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 51,01,397కి పెరిగింది. దేశ వ్యాప్తంగా 9,47,576యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

30న బాబ్రీ కూల్చివేత కేసుపై తుదితీర్పు.. కోర్టుకు రానున్న అద్వానీ - జోషి!