Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో లక్ష దాటిన కరోనా కేసులు.. 478 మంది మంది మృతి

Advertiesment
India
, సోమవారం, 5 ఏప్రియల్ 2021 (11:19 IST)
భారత్‌లో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. దేశంలో తొలిసారి కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. గత ఏడాది సెప్టెంబరు 17న దేశంలో గరిష్ఠంగా 97వేల 894 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ రికార్డు దాటి గత 24 గంటల్లో లక్షా, 3వేల, 558 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 
 
ఆదివారం 52వేల 847 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటి, 25లక్షల, 89వేల, 67కు చేరింది. గడిచిన 24 గంటల సమయంలో 478 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య లక్షా, 65వేల, 101కు పెరిగింది. 
 
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు కోటి,16 లక్షల, 82వేల, 136మంది కోలుకున్నారు. 7లక్షల, 41వేల, 830 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 7కోట్ల, 91లక్షల, 5వేల, 163 మందికి వ్యాక్సిన్లు వేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోడిమాంసం ధరలకు రెక్కలొచ్చాయి... కేజీ చికెన్ రూ.300కు చేరువలో..