Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిడ్ 19 బారి నుంచి ఇండియన్స్ ఎలా బయటపడుతున్నారబ్బా? వాళ్లకున్న శక్తి ఏంటి?

కోవిడ్ 19 బారి నుంచి ఇండియన్స్ ఎలా బయటపడుతున్నారబ్బా? వాళ్లకున్న శక్తి ఏంటి?
, సోమవారం, 2 నవంబరు 2020 (22:30 IST)
82 లక్షల మందికి కోవిడ్ 19 సోకింది. వీరిలో 75 లక్షల మంది మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. లక్షా 20 వేల మంది మృత్యువాత పడ్డారు. మిగిలినవారు ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు. ఈ లెక్కలు చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. కరోనాకోరల్లో చిక్కి అగ్రరాజ్యంతో సహా పలు దేశాల్లోని ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ఇండియాలో మాత్రం కోలుకుంటున్నవారి సంఖ్య అధికంగా వుంటోంది. ఏంటీ లెక్క?
 
వాస్తవానికి లక్షలాది మంది భారతీయులకు పరిశుభ్రమైన నీరు కరవు. పరిశుభ్రమైన ఆహారాన్ని తినడానికి వుండదు. పక్కనే దుర్వాసనతో కూడుకున్న గాలిని పీల్చుకుంటూ ఇరుకు ఇళ్లలో నివాసం ఉంటుంటారు. వీటి కారణంగా గుండె, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. కేవలం వాయు కాలుష్యం కారణంగా ప్రతి ఏడాది 10 లక్షల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోతున్నట్లు లెక్కలు చెపుతున్నాయి.
 
కోవిడ్ -19 నుండి ఆరోగ్య పరిరక్షణకు సురక్షితమైన నీరు, పారిశుధ్యం, పరిశుభ్రమైన పరిస్థితులు అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఐతే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం అలాంటి పరిస్థితులు భారతదేశంలో చాలా తక్కువ. దీనితో కరోనావైరస్ ప్రవేశంతో భారీ జన నష్టం జరుగుతుందన్న ఆందోళన రేగింది. ప్రపంచ జనాభాలో ఆరవ వంతు భారతదేశంలో ఉంది. నమోదైన కేసులలో ఇండియాది ఆరో స్థానం. ఏది ఏమయినప్పటికీ, ఇది ప్రపంచంలోని వైరస్ మరణాలలో 10% మాత్రమే. కోవిడ్ -19 రోగులలో మరణాలను కొలిచే దాని మరణాల రేటు ప్రకారం అది 2% కన్నా తక్కువ, ఇది ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది.
 
దీనికి కారణాలు ఏమిటి... అని భారతీయ శాస్త్రవేత్తల చేసిన కొత్త పరిశోధన ప్రకారం తక్కువ పరిశుభ్రత, పరిశుభ్రమైన తాగునీరు లేకపోవడం మరియు అపరిశుభ్ర పరిస్థితులు తీవ్రమైన కోవిడ్ -19 నుండి చాలా మంది ప్రాణాలను కాపాడి ఉండవచ్చు.
 
మరో మాటలో చెప్పాలంటే, తక్కువ మరియు తక్కువ మధ్య-ఆదాయ దేశాలలో నివసించే ప్రజలు బాల్యం నుండి వివిధ వ్యాధికారక అనారోగ్య సమస్యలకు గురికావడం వలన సంక్రమణ యొక్క తీవ్రమైన రూపాలను నివారించే శక్తి వారిలో నిగూఢమై వున్నదని చెపుతున్నారు. ఇప్పుడిదే కోవిడ్ -19కు బలమైన రోగనిరోధక శక్తిని ఇస్తున్నాయని వారు నమ్ముతున్నారు. ప్రస్తుతం దీనిపైనే దేశంలో అధ్యయనం జరుగుతోంది. త్వరలో పూర్తి వివరాలు బయటకు వెల్లడి కానున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉల్లి ధర ఘాటుకు కన్నీళ్లు, మహిళలు, వ్యాపారులు ఆందోళన