Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనాతో చనిపోయిన కూతురి శవాన్ని కారులో పక్కన కూర్చోబెట్టి తీసుకెళ్ళిన తండ్రి

కరోనాతో చనిపోయిన కూతురి శవాన్ని కారులో పక్కన కూర్చోబెట్టి తీసుకెళ్ళిన తండ్రి
, మంగళవారం, 25 మే 2021 (19:09 IST)
కరోనా కాలంలో ఆంబులెన్స్‌లు ధరలతో జనం నానా తంటాలు పడుతున్నారు. మూడు వందల కిలోమీటర్లకు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారని తెలుగు రాష్ట్రాల ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చింది. అంతేకాదు వారు చెప్పిందే రేటు. 
 
రాజస్థాన్‌లో 34 యేళ్ళ ఒక యువతి కరోనాతో చనిపోయింది. పోటా ఆసుపత్రిలో చనిపోగా ఆమెను సొంతూరు జాల్వార్‌కు తీసుకెళ్ళాల్సి వచ్చింది. 30 కిలోమీటర్ల దూరానికి ఆంబులెన్స్ వారు ఏకంగా 35 వేల రూపాయలు అడిగారు. అప్పటికప్పుడు తన దగ్గర అంత డబ్బులు లేవని గుర్తించాడు తండ్రి.
 
దీనితో కుమార్తె మృతదేహాన్ని తన కారులోనే పడుకోబెట్టి తీసుకెళ్ళాడు. ముందు సీటును బెండ్ చేసి అందులో మృతదేహాన్ని పడుకోబెట్టాడు. ఇలా తన కుమార్తె మృతదేహాన్ని కారులోనే తీసుకెళ్ళాడు. ఈ వీడియోను ఒక జర్నలిస్టు పోస్టు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆంబులెన్స్ మాఫియా బాగోతం బట్టబయలైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాటా స్టీల్ సంచలన నిర్ణయం: కరోనాతో మృతి చెందితే 60 సంవత్సరాల వరకూ జీతం