Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిడ్‌, ఒమిక్రాన్‌పై నిపుణుల హెచ్చరిక

కోవిడ్‌, ఒమిక్రాన్‌పై నిపుణుల హెచ్చరిక
, శనివారం, 15 జనవరి 2022 (12:02 IST)
కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరో మూడు నాలుగు వారాలు పోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారనుంది. ఇప్పటికే దేశంలో రోజుకు వచ్చే కరోనా కేసులు రెండున్నర లక్షలు దాటాయి. మున్ముందు తీవ్రత పీక్ స్టేజ్ కు పోతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒమిక్రాన్‌ను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదు. ఇప్పటికి ఆస్పత్రుల్లో చేరుతున్న వాళ్ల సంఖ్య తక్కువగానే ఉన్నా.. ముందు ముందు కేసులెక్కువైతే ఆస్పత్రుల్లో చేరే వాళ్ల సంఖ్య కూడా పెరిగే ప్రమాదం లేకపోలేదు. 
 
ఒమిక్రాన్‌ను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం రోజురోజుకు పాజిటివిటీ రేట్ పెరిగిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండక్కి పట్టణాల నుంచి జనమంతా పల్లెబాట పట్టారు. ఈ పరిస్థితి మరింత ప్రమాదమని వైద్యనిపుణులు చెబుతున్నారు.

పట్నం నుంచి వైరస్ పల్లెలకు వ్యాపించడం ఖాయమని అంటున్నారు నిపుణులు.పండగని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిదంటున్నారు.
 
దేశంలో శరవేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. పదిరోజులకు ముందు పరిస్థితి వేరు. ఇప్పుడున్న పరిస్థితి వేరు.. మరో వారం రోజుల్లో కేసులు రెట్టింపవడం ఖాయంగా కనిపిస్తుంది. అందుకే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేట్ కావాలని సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ విగ్రహం ధ్వసం.. కత్తితో నరికి?