ఏలూరు కలెక్టరేట్లో కరోనా కలకలం రేపింది. కలెక్టరేటులో పనిచేసే ఐదుగురు ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో వారు హోం ఐసోలేషన్లో వున్నారు. కలెక్టరేట్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. మిగిలిన సిబ్బందికి నెగెటివ్గా వచ్చింది.
కలెక్టరేట్లో ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో తోటి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం కలెక్టరేట్లోని రెండు సెక్షన్ల సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
అయితే పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలో కరోనా చాప కింద నీరులా పారుతోంది. గత కొన్ని రోజులుగా పదికి పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో తొలి కరోనా కేసు విశాఖపట్నంలో నమోదు అయ్యింది. విశాఖకు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో వెంటనే చికిత్స అందేశారు.