Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
, శుక్రవారం, 19 మార్చి 2021 (10:44 IST)
తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం కొత్తగా 313 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,360కి చేరింది. ఇందులో 2,98,262 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,434 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
ఇక తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1664కి చేరింది. కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ముఖ్యంగా స్కూల్స్, ఆలయాల్లో కేసులు నమోదవుతుండటంతో వీటిపై దృష్టి సారించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. కూతురిపై తండ్రి అత్యాచారం.. ఎన్నికల పోటీ నుంచి..?