Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. త్రిపురను వణికిస్తున్న డెల్టా ప్లస్‌ వేరియంట్‌

Advertiesment
దేశంలో విజృంభిస్తున్న కరోనా.. త్రిపురను వణికిస్తున్న డెల్టా ప్లస్‌ వేరియంట్‌
, శనివారం, 10 జులై 2021 (12:57 IST)
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 42,766 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక 45,254 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 1206 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు ఇండియాలో నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,95,716గా ఉంది. దేశంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,07,145కు చేరుకుంది.
 
త్రిపురను డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వణికిస్తోంది. 151 శాంపిల్స్‌ను జీనోమ్‌ స్వీకెన్సింగ్‌కు పంపగా...138 కేసులు డెల్టా ప్లస్‌ వేరియంట్‌గా తేలాయని రాష్ట్ర ఆరోగ్య నిఘా అధికారి డా.దీప్‌ కుమార్‌ దెబ్బర్మా శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో డెల్టా వేరియంట్‌ ప్లస్‌ కేసులు నమోదు చేసిన తొలి రాష్ట్రంగా త్రిపుర నిలిచింది. 
 
బెంగాల్‌లోని కల్యాణిలో ల్యాబోరేటరీకి పరీక్షల కోసం శాంపిల్స్‌ను పంపామని, మొత్తం 151 కేసులుగానూ 138 డెల్టా వేరియంట్‌ ప్లస్‌ కేసులుగా గుర్తించారని అన్నారు. మిగిలిన 10 కేసులు డెల్టా వేరియంట్‌ కాగా, మూడు కేసులు అల్ఫా వేరియంట్‌గా గుర్తించినట్లు దీప్‌ కుమార్‌ చెప్పారు. 
 
ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు నైట్‌ కర్ఫ్యూతో పాటు 13 అర్బన్‌ ప్రాంతాల్లో వారాంతపు లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంట వరకు వారాంతపు లాక్‌డౌన్‌ను విధించింది. నైట్‌ కర్ఫ్యూను జులై 17 వరకు పొడిగించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డీపీఆర్ ఓ భాస్కర నారాయణకు విజయవాడ ఎస్ఐసి ఎడిగా పదోన్నతి