Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్ కొత్త వేరియంట్ స్ట్రైయిన్‌పై భారత్ అప్రమత్తం

కరోనా వైరస్ కొత్త వేరియంట్ స్ట్రైయిన్‌పై భారత్ అప్రమత్తం
, సోమవారం, 21 డిశెంబరు 2020 (10:51 IST)
కరోనా వైరస్ కొత్త వేరియంట్ స్ట్రైయిన్‌పై భారత్ అప్రమత్తమైంది. యూకేలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ కొత్తరకం వైరస్‌కు సంబంధించి చర్చించేందుకు సోమవారం ఉదయం ఆరోగ్యమంత్రిత్వశాఖ అత్యవసర భేటీ ఏర్పాటు చేసింది. కోవిడ్‌-19 ఉమ్మడి పర్యవేక్షణ బృందాన్ని భేటీకి కేంద్రం పిలిచింది. స్ట్రెయిన్‌ ఆవిర్భావం సహా పలు కీలక అంశాలపై కేంద్రం చర్చించనుంది. 
 
ఈ సమావేశానికి డబ్ల్యూహెచ్‌ఓలోని భారత ప్రతినిధి రోడరికో హెచ్‌ ఓఫ్రిన్‌ హాజరు కానున్నారు. బ్రిటన్‌ సహా ఆఫిక్రాదేశాల్లో కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే ఆదివారం లండన్‌లో ప్రభుత్వం ఆదివారం లాక్‌డౌన్‌ విధించింది. స్ట్రెయిన్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వెల్లడించారు. 
 
ఈ క్రమంలో ఇప్పటికే యూరోపియన్‌ దేశాలు బిట్రన్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. బెల్జియం, నెదర్లాండ్‌, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా, ఐర్లాండ్, బల్గేరియా, కెనడా ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అయితే యూకే నుంచి విమానాల నిషేధంపై భారత్‌ ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తామని ఓ అధికారి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాకు 24 గంటల్లో 333 మంది మృత్యువాత