Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా.. ఆర్బీఐ చెప్పేదేమిటంటే?

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా.. ఆర్బీఐ చెప్పేదేమిటంటే?
, సోమవారం, 5 అక్టోబరు 2020 (16:20 IST)
కరోనాతో పాటు ఇతరత్రా వైరస్‌లు కరెన్సీ నోట్ల ద్వారా వ్యాపించే అవకాశం వుందని భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ధ్రువీకరించింది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. గత మార్చి 9వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆల్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాసిన లేఖలో.. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తించే అవకాశం వుందని తెలిపింది. 
 
కరోనా మాత్రమే కాకుండా బ్యాక్టీరియాలు, వైరస్‌లు కూడా వ్యాప్తి చెందుతాయా అనే అనుమానాన్ని లేవనెత్తింది. ఈ లేఖను కేంద్ర ఆర్థిక శాఖ ఆర్బీఐకి పంపింది. దీనిపై స్పందించిన ఆర్బీఐ.. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్‌తో పాటు బ్యాక్టీరియాలు కూడా వ్యాపించే అవకాశం వుందని తెలిపింది. 
 
అందుచేత కరోనాను నియంత్రించేందుకు కరెన్సీ వినియోగాన్ని తగ్గించుకుని డిజిటల్ లావాదేవీలను చేయాలని ఆర్బీఐ తెలిపినట్లు ఆల్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. ఇంకా ప్రజలు అనవసరంగా బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బు డ్రా చేసుకోవద్దని.. అనేక ఆన్‌లైన్ వసతుల ద్వారా నగదు లావాదేవీలను జరపాలని ఆర్బీఐ తెలిపినట్లు ఆల్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌ను అమిత్ షా మందలించారా? జగన్ బెండ్ అయ్యే రకం కాదు, బెండ్ తీసే రకం