Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Corona second wave: 730 మంది వైద్యులను మింగేసిన కరోనా

Advertiesment
730 Doctors
, బుధవారం, 16 జూన్ 2021 (21:32 IST)
కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్‌లో 730 మంది వైద్యులు మరణించారని బీహార్‌లో గరిష్ట మరణాలు సంభవించాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) బుధవారం తెలిపింది.
బీహార్‌లో 115 మంది వైద్యుల మరణాలు నమోదయ్యాయి, ఢిల్లీలో 109 మంది మరణించారు, ఉత్తరప్రదేశ్‌లో 79 మంది మరణించారు.
 
దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 38, తెలంగాణ 37, కర్ణాటక 9, కేరళ 24, ఒడిశా 31 మరణాలు నమోదయ్యాయి. నేడు, భారతదేశం గత 24 గంటల్లో 62,224 తాజా COVID-19 కేసులను నమోదు చేయగా, రోజువారీ పాజిటివిటీ రేటు 3.22 శాతానికి పడిపోయిందని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoFHW) తెలిపింది.
webdunia
వరుసగా తొమ్మిది రోజులు రోజువారీ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. క్రియాశీల కేసులు 8,65,432కు తగ్గాయి. 70 రోజుల్లో తొలిసారిగా ఇవి 9 లక్షలకు తగ్గాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, జాతీయ COVID-19 రికవరీ రేటు 95.80 శాతానికి మెరుగుపడింది. కొత్త కేసులతో దేశ సంఖ్య 2,96,33,105కు చేరుకుంది. COVID-19 మరణాల సంఖ్య గత 24 గంటల్లో 2,542 తాజా మరణాలతో 3,79,573కు చేరుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బైక్‌పై సర్కస్‌.. భలే బ్యాలెన్స్ చేసిందిగా.. వండర్ వుమెన్ (వీడియో)