Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబైలో 16 మంది జర్నలిస్టులకు కరోనా వైరస్

ముంబైలో 16 మంది జర్నలిస్టులకు కరోనా వైరస్
, సోమవారం, 27 ఏప్రియల్ 2020 (20:12 IST)
విధి నిర్వహణలో చాలామంది జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చెన్నైలో ఒక టీవీఛానల్‌కు చెందిన కొంతమంది జర్నలిస్టులకు కరోనా సోకింది. దీంతో న్యూస్ ఛానల్‌ను తాత్కాలికంగా మూసేయాల్సి వచ్చింది. జర్నలిస్టుల కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు.
 
అయితే తాజాగా ముంబైలోని ఒక టీవీచానల్(మరాఠి)లో 17 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చిందట. దీంతో ఒక్కసారిగా ఛానల్ యాజమాన్యం ఉలిక్కిపడింది. వెంటనే ఉద్యోగస్తులందరికీ రక్తపరీక్షల కోసం ప్రభుత్వాన్ని కోరింది. వారి కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్‌కు తరలించారు.
 
అయితే కేంద్రప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ కోసం బీమా కల్పించాలని ఇప్పటికే ఎన్నో రాష్ట్రాల నుంచి వినతులు కూడా వెళ్ళాయి. స్వయంగా ఎపి రాష్ట్రబిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. కరోనాపై ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తున్న జర్నలిస్టులకు బీమా అందించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మోడీ నిర్ణయం తీసుకుంటే తప్ప జర్నలిస్టులకు బీమా వర్తించే అవకాశం లేదంటున్నారు బిజెపి నేతలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొదట నెగెటివ్... ఇంటికెళ్లాక పాజిటివ్