Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో క్రైస్తవ్య ప్రవేశం ఎలా? శాంతోమ్ గురించి తెలుసా?

Advertiesment
christianity in india history
, బుధవారం, 25 జూన్ 2014 (17:32 IST)
భారత దేశంలో క్రైస్తవ్య ప్రవేశం ఎలా జరిగిందంటే.. భారత దేశంలో క్రైస్తవ్యాన్ని తొలుత ప్రవేశపెట్టిన వాడు క్రీస్తు శిష్యుడైన 'తోమా'. ఇతడు AC53లో పర్షియా దేశం నుండి దక్షిణ భారత దేశంలో మలబారులోని పెరియారు నది తీరపు ఖద్వారంలోఉన్న కాంగ్రనూరు చేరి అక్కడ క్రీస్తుని గురించి భోదించినట్లు చరిత్ర కారులు భావిస్తున్నారు. 
 
భారత దేశానికి నౌకా మార్గం, వాణిజ్య సంబంధాలు ఉన్నందువల్ల క్రైస్తవ్యం భారత దేశానికి మొదటి శతాబ్దంలో వచ్చింది. మొట్ట మొదట తోమా సువార్త భోధన ద్వారా కాంగ్రనూరులో నాలుగు హిందూ కుటుంబాల వారు క్రైస్తవులుగా మారారు. అతడు వారికి బైబిలును భోధించి, ప్రార్ధనా విధానాలను నేర్పించి, తర్వాత కాంగ్రనూరుకి దక్షిణంగా ఉన్న మలీయన్కార, పాలయార్, గోక మంగళం, సీరణం, చాయల్, క్విలాన్, అనే ప్రాంతాలలో క్రీస్తు సువార్తను భోధించి, సంఘాల్ని స్థాపించాడు. 
 
తోమా మలబారు ప్రాంతం నుండి చెన్నపట్టణం చేరి సువార్త ప్రచారం చేసాడు. ఆ రక్షణ సువార్త విని అనేకులు క్రైస్తవులుగా మారడం చూసి అక్కడి పురోహిత వర్గం AC 72 లో తోమాపై దాడి చేసి, ఈటెలతో పొడిచి చంపారు. ఆతనని చంపిన ప్రదేశమే నేడు శాంతోం/సెయింట్ చర్చిగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu