కావలసిన పదార్థాలు :
రస్కులపొడి లేదా బ్రెడ్ పొడి... 300 గ్రా.
కారమెల్... ఆరు టీ.
పంచదారపొడి... అరకేజీ
గుడ్లు... పది
మైదా... 200 గ్రా.
జీడిపప్పు... వంద గ్రా.
ఖర్జూరం... 200 గ్రా.
ఎండుద్రాక్ష... వంద గ్రా.
యాపిల్స్... నాలుగు
తయారీ విధానం :
ఓ గిన్నెలో కోడిగుడ్లు, పంచదారపొడి వేసి బాగా గిలకొట్టాలి. డ్రైఫ్రూట్స్ను సన్నని ముక్కలుగా కోసి పెట్టాలి. యాపిల్స్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. ఈ పండ్ల మిశ్రమంలో మైదాపిండి కలిపి ఉంచాలి. వెన్నను మెత్తగా గిలకొట్టి అందులోనే కోడిగుడ్ల మిశ్రమాన్ని కలపాలి. బ్రెడ్ పొడిని కూడా వేసి కలియతిప్పాలి. ఇప్పుడు పండ్ల మిశ్రమాన్ని కలపాలి.
చివరగా కారమెల్ను కూడా కలిపి ఏదైనా ఫుడ్డింగ్ మౌల్డ్ లేదా గిన్నెలో వేసి మూతపెట్టాలి. ఓ పెద్ద గిన్నె లేదా కుక్కర్లో సరిపడా నీళ్లు పోసి ఫుడ్డింగ్ గిన్నెని అందులో పెట్టి ఆవిరిమీద 2 గంటలపాటు సన్ననిమంటమీద ఉడికించాలి. పూర్తిగా చల్లారిన తరువాత ముక్కలుగా కోసి సాస్తో వడ్డించాలి.