Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నై బీచ్‌కి ఆయిల్ తెట్టు... బాబోయ్ చేపలు కొనొద్దంటూ...

చెన్నై పోర్టుకు సమీపంలో శనివారం నాడు రెండు రవాణా నౌకలు ఢీకొట్టుకున్న ఘటనలో పెద్దఎత్తున చమురు సముద్రంలో కలిసింది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ లోడుతో పోర్టు నుంచి బయటకు వెళుతున్న నౌక ఎదురుగా వచ్చిన మరో న

చెన్నై బీచ్‌కి ఆయిల్ తెట్టు... బాబోయ్ చేపలు కొనొద్దంటూ...
, గురువారం, 2 ఫిబ్రవరి 2017 (17:10 IST)
చెన్నై పోర్టుకు సమీపంలో శనివారం నాడు రెండు రవాణా నౌకలు ఢీకొట్టుకున్న ఘటనలో పెద్దఎత్తున చమురు సముద్రంలో కలిసింది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ లోడుతో పోర్టు నుంచి బయటకు వెళుతున్న నౌక ఎదురుగా వచ్చిన మరో నౌకను ఢీకొట్టింది. దీనితో నౌకలో వున్న పెట్రోలియం ఆయిల్ లూబ్రికెంట్స్ సముద్రంలో కలిశాయి. 
 
ప్రమాదం జరిగి 5 రోజులు అయిన తర్వాత చెన్నై సముద్ర తీరానికి చమురు తెట్టు కట్టడంతో స్థానికులు దాన్ని వెలికి తీస్తున్నారు. మరోవైపు సముద్రంలో వున్న జలచరాలు... తాబేళ్లు, చేపలు చచ్చిపోతున్నాయి. దీనిపై అటు కేంద్ర పర్యావరణ శాఖామంత్రి కానీ లేదంటే తమిళనాడు ముఖ్యమంత్రి కానీ పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం జాలర్లకు నష్టాలను తెచ్చేదిగా వున్నట్లు చెపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాదక ద్రవ్యాలకు బానిసైపోయాడు.. ప్రశ్నించిన తల్లిని కాంపస్‌తో పొడిచేశాడు..