బెంగళూరుకు చెందిన జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్వారు ఫెలోషిప్స్-2009 కోసం మ్యాథమాటిక్స్ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ప్రతి సంవత్సరం, భారతదేశంలోని మంచి ప్రతిభా పాటవాలు కలిగిన 5 వేల మంది విద్యార్థులను ఎంపిక చేసి, వారిని 120 రకాల పెలోషిప్స్ అవార్డులతో పై సైంటిఫిక్ రీసెర్చివారు సత్కరిస్తున్నారు. ఇందులో భాగంగా 2009 ఫెలోషిప్స్ కోసం పై ప్రకటన చేశారు.
ఈ ఫెలోషిప్స్కుగానూ... ప్రస్తుతం బీఎస్సీ, బీవీఎస్సీ, ఎంబీబీఎస్, బీఫార్మసీ (మెదటి, రెండో, మూడో), ఎంఎస్సీ (మొదటి, రెండో), బీఈ, బీటెక్ (రెండో, మూడో), ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ చదువుతున్న విద్యార్థులు అర్హులు.
దరఖాస్తు విధానం ఎలాగంటే... జవహర్లాల్ నెహ్రూ సైంటిఫిక్ రీసెర్చ్ వారి వెబ్సైట్ నుండి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా 16X25 సైజు కలిగిన ఎన్వలప్ కవర్పైన 10 రూపాయల పోస్టల్ స్టాంపును అతికించిన సొంత చిరునామా కలిగిన కవరును "ది అసిస్టెట్ కో ఆర్డినేటర్, జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్, జక్కుర్, పీఓ, బెంగళూరు-560064" అనే అడ్రస్సుకు పంపి, పోస్ట్ ద్వారా పొందవచ్చు.
పూర్తి వివరాల కోసం డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.జెఎన్సిఏఎస్ఆర్.ఏసీ.ఇన్ అనే వెబ్సైటును సంప్రదించండి.