భారతీయ రైల్వే శాఖలోని రైల్వే రిక్రూట్మెంట్ ఛండీగర్ విభాగంలో వివిధ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 28వ తేదీలోపు పంపించాల్సి వుంది. అయితే ఈశాన్య రాష్ట్రాలతో సహా, విదేశాల్లో నివశిస్తున్న అర్హులైన అభ్యర్థులు మార్చి 13వ తేదీలోపు దరఖాస్తులు పంపించాల్సి వుంటుంది.
కాగా, సెక్షన్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), జూనియర్ ఇంజనీర్, డిపార్ట్మెంట్ మెటిరీయల్ సూపరింటెండ్, అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ (ఫిట్టర్), టెక్నీషియన్ వైర్మెన్, లైన్మెన్, టీఎంసీ వంటి అనేక విభాగాల్లో మొత్తం పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులకు రాత/ఆన్లైన్లలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం ఆర్ఆర్బిసిడిజి.ఓఆర్జీ అనే వెబ్సైటులో చూడొచ్చు.