Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మైక్రోబయాలజీ శాస్త్రవేత్త పోస్టు భర్తీకి ఆహ్వానం

Advertiesment
బీహార్ పాట్నా రాజేంద్ర మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ దరఖాస్తు అర్హులు హీహెచ్డి
, మంగళవారం, 24 ఫిబ్రవరి 2009 (15:14 IST)
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా, అగమ్‌కౌన్‌లోని రాజేంద్ర మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మైక్రోబయాలజీ సైంటిస్ట్ పోస్టు భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలాగే ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ, లైఫ్ సైన్సెస్‌ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అర్హులే.

అయితే వీరు పీహెచ్‌డీ తప్పకుండా పూర్తి చేసి వుండాలి. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 45 సంవత్సరాల వయస్సుకు మించి ఉండరాదు. ఎస్సీ, ఎస్టీ, ఒబీసీ, వికలాంగ అభ్యర్థులు మాత్రం ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వుంటుంది.

పూర్తి చేసిన దరఖాస్తులను రాజేంద్ర మెమోరియల్ రీసెర్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అకమకౌన్, పాట్నా-7 అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. కాగా, ఈ పోస్టుకు ఎంపికయ్యే అభ్యర్థులకు 15,600-39,100), గ్రేడ్ పే రూ.7600 చొప్పున అందజేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu