దేశ బీమారంగ సంస్థ ఎల్.ఐ.సీలో డైరక్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఎల్ఐసీకి చెందిన బెంగుళూరు, ఎర్నాకుళం, ఢిల్లీ, కోల్కతా కార్యాలయాల్లో మూడేళ్ళ కాలపరిమితితో కూడిన కాంట్రాక్టు ప్రాతిపదికన డైరక్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ల నియామకానికి తాజాగా ప్రకటన వెలువడింది.
బెంగుళూరులో 75, ఎర్నాకుళంలో 50, ఢిల్లీలో 75, కోల్కతాలో 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు రూ.10,000 చొప్పున వేతనం చెల్లిస్తారు. ఏదేనీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీతో పాటు.. మార్కెటింగ్, మేనేజ్మెంట్లలో డిప్లొమో, ఆంగ్లంతో పాటు, స్థానిక భాషపై పట్టు కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
జూన్ ఒకటో తేదీ నుంచి 21 నుంచి 35 సంవత్సరాలు మించి ఉండరాదు. ఎస్సీ, ఎస్టీలకు 40, ఓబీసీ విద్యార్థులకు 38 సంవత్సరాల వరకు వయస్సు సడలింపు ఉంది. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
బెంగుళూరుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తులను ఈనెల 15వ తేదీలోగా పూర్తి చేసి పంపాల్సి వుంటుంది. అలాగే, కోల్కతాకు జూన్ 15, ఢిల్లీకి జూన్ 17, ఎర్నాకుళంకు ఈనె 18వ తేదీలోగా పంపాల్సి వుంటుంది. పూర్తి వివరాల కోసం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ ఎల్ఐసిఇండియా డాట్ కామ్ అనే వెబ్సైటులో సందర్శించవచ్చు.