ప్రముఖ అకౌంటింగ్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈ&వై) భారత్, చైనాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీ నియామకాలను చేపట్టనుంది. 2011 ఆర్థిక సంవత్సరంలో తమ సేవల విస్తరిణలో సుమారు 6,500 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు కంపెనీ తెలిపింది. వర్ధమాన మార్కెట్లైన భారత్, చైనాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ నియామకాలను చేపట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఈ నియామకాల్లో భాగంగా వర్ధమాన మార్కెట్లైన భారత్లో 2,500 మంది, చైనాలో 2,000 మంది, రష్యాలో 1,000 మంది, ఆఫ్రికాలో 1,000 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించింది. ఈ కొత్త నియామకాలు అస్యూరెన్స్, ట్యాక్స్, ట్రాన్సాక్షన్, అడ్వైజరీ విభాగాల్లో ఉంటాయి. జూన్ 30, 2010తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ 21.3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.