Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్" (నెట్) నోటిఫికేషన్

Advertiesment
కెరీర్ అవకాశాలు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ నోటిఫికేషన్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ లెక్చరర్షిప్ యూనివర్శిటీ
, శుక్రవారం, 17 అక్టోబరు 2008 (17:00 IST)
FileWD
ఈ సంవత్సరం నిర్వహించే "నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్" (నెట్)కు నోటిఫికేషన్ విడుదలయ్యింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) పొందాలన్నా, లెక్చరర్‌షిప్ నియామకానికైనా... నెట్ అర్హత సాధించటం తప్పనిసరి కాగా, ఈ టెస్ట్‌ను యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ (యూజీసీ) నిర్వహిస్తుంది.

హ్యూమానిటీస్ (లాంగ్వేజస్‌తో పాటు), ఫోరెన్సిక్ సైన్సెస్, పర్యావరణ శాస్త్రాలు, కంప్యూటర్ సైన్స్, అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్ సైన్స్ లాంటి మొత్తం 77 సబ్జెక్టుల్లో ఈ అర్హతా పరీక్షలను నిర్వహించనున్నారు.

కాగా, నెట్‌లో అర్హత పొందిన వారిలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు జేఆర్ఎఫ్ అందజేస్తారు. తరువాత వీరికి యూజీసీ ఆధ్వర్యంలో వివిధ పథకాల కింద జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ను అందజేస్తారు. అలాగే అర్హత సాధించిన ఇతర అభ్యర్థులకు లెక్చరర్‌షిప్ లభిస్తుంది. వీరు అధ్యాపక పోస్టుల్లో ప్రభుత్వ నిబంధనల ఆధారంగా నియామకం పొందవచ్చు.

నెట్ పరీక్షలకు అర్హతల విషయానికొస్తే... సంబంధిత పీజీ సబ్జెక్టుల్లో అభ్యర్థులు 55 శాతం మార్కులు పొంది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, పీహెచ్‌ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలు రాయబోయే అభ్యర్థులు లేదా ఫలితాల కోసం చూస్తున్న అభ్యర్థులు కూడా నెట్ రాసేందుకు అర్హులే.

జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం ఈ ఏడాది డిసెంబర్ ఒకటో తేదీ నాటికి 28 సంవత్సరాలు మించని వారై ఉండాలి. అయితే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీహెచ్, పీహెచ్ అభ్యర్థుల వయసులో మాత్రం ఐదేళ్ల గరిష్ట సడలింపు ఉంటుంది. అలాగే, రీసెర్చ్ అనుభవం, ఎల్ఎల్‌బీ డిగ్రీ కలిగిన అభ్యర్థులకు కూడా గరిష్ట వయోసడలింపు ఉంటుంది. కాగా, లెక్చరర్‌షిప్‌వారికి మాత్రం ఎలాంటి వయో పరిమితి లేదు.

ఇకపోతే... జనరల్ అభ్యర్థులకు 450; ఓబీసీ అభ్యర్థులకు 225; ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, వీహెచ్ అభ్యర్థులకు 110 రూపాయలు పరీక్ష ఫీజు ఉంటుంది. పరీక్ష విధానం విషయానికొస్తే... మొత్తం మూడు పేపర్లుండగా, పరీక్ష మాత్రం ఒకేరోజు నిర్వహిస్తారు. పేపర్-1, పేపర్-2 లు చెరి వంద మార్కుల చొప్పున ఉంటాయి. పేపర్-3లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి పూర్తిగా డిస్క్రిప్షన్ విధానంలో ప్రశ్నలుంటాయి. కాగా, చివరి పేపర్‌కు 200 మార్కులుంటాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... హైదరాబాదులోని ఉస్మానియా, విశాఖపట్నంలోని ఆంధ్ర, గుంటూరులోని నాగార్జున, తిరుపతిలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ నవంబర్ 7, 2008. పరీక్ష తేదీ డిసెంబర్ 28, 2008. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే యూజీసీ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

Share this Story:

Follow Webdunia telugu