హైదరాబాదులోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం దూర విద్య ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశానికిగానూ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
దరఖాస్తుల ఫారాల కోసం... 250 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ను చెల్లించి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ నుంచి పొందవచ్చు. లేదా విశ్వ విద్యాలయం వెబ్సైట్ నుంచి కూడా దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పూర్తి చేసిన దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ నవంబర్ 29, 2008. కాగా, ఆలస్య రుసుముతో డిసెంబర్ 31, 2008 దాకా స్వీకరిస్తారు. మరిన్ని వివరాలకు డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.తెలుగుయూనివర్సిటీ.ఏసీ.ఇన్ వెబ్సైట్ను సందర్శించండి.
కోర్సుల వివరాలు :
ఎంఏ జ్యోతిష్యం... కాల వ్యవధి రెండు సంవత్సరాలు కాగా, ఏదేని డిగ్రీ చదివిన వారు అర్హులు.
ఎంఏ సంస్కృతం... కాల వ్యవధి రెండు సంవత్సరాలు కాగా, ఏదేని డిగ్రీ చదివి.. ఆధునిక లేదా సంప్రదాయ భాషను ద్వితీయ భాషగా అధ్యయనం చేసి ఉండాలి.
ఎంఏ తెలుగు... కాలవ్యవధి రెండు సంవత్సరాలు. ఏదేని డిగ్రీ చదివి ద్వితీయ భాషగా లేదా ఆప్షనల్గా తెలుగు చదివి ఉండాలి.
ఎంసీజే... కాలవ్యవధి రెండు సంవత్సరాలు. ఏదేని డిగ్రీ చదివి ఉండాలి.
సంగీత విశారద... కాలవ్యవధి నాలుగు సంవత్సరాలు. పదో తరగతి ఉత్తర్ణత సాధించి ఉండాలి.
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ మోడర్న్ తెలుగు... పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.