Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాబ్స్.. జాబ్స్..: ప్రభుత్వ బ్యాంకుల్లో 85,000 ఉద్యోగాలు

Advertiesment
85 వేల ఉద్యోగాలు
బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి చూపే అభ్యర్థులకు శుభసమయం రానుంది. రానున్నమూడేళ్ళలో ప్రభుత్వ రంగ (పిఎస్‌యూ) బ్యాంకులు కొత్తగా 85 వేల ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. వీరిలో 34,000 మందిని ఆఫీసర్ కేడర్‌లోనూ, 51,000 మందిని క్లరికల్ కేడర్‌లోనూ బ్యాంకులు నియమించుకోనున్నాయి. 2013 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

బ్యాంకులలో ఏర్పడిన ఉద్యోగ కొరతను పూర్తిగా అధిగమించే దిశగా పిఎస్‌యు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయని న్యూడిల్లీలో జరిగిన ఎకనామిక్ ఎడిటర్స్‌ కాన్ఫరెన్స్ కోసం రూపొందించిన పత్రంలో కేంద్ర ఆర్థిక శాఖ ఈ విషయాలను వెల్లడించింది. ఈ నియామకాల ప్రక్రియ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబిపిఎస్‌) ఆధ్వర్యంలో జరుగుతుంది.

ఈ నియామకాలు పారదర్శకంగానూ.. వేగవంతంగానూ.. కొనసాగుతుందని ఐబిపిఎస్‌ తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జరిగే కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ఎగ్జామినేషన్స్‌ అన్నంటినీ ఐబిపిఎస్‌ నిర్వహిస్తుందని తెలిపింది. గత సంవత్సరం ఐబిపిఎస్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 125 సెంటర్లలో 60 లక్షల మందికి పరీక్షలు నిర్వహించింది.

Share this Story:

Follow Webdunia telugu