ఛత్తీస్గఢ్ రాష్ట్రం, రాయ్పూర్లో అకౌంటెంట్ జనరల్ పోస్టుల కోసం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆఫీస్ ఆఫ్ ది అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) విభాగంలో 41 పోస్టులు, ఆఫీస్ ఆఫ్ ది అకౌంటెంట్ జనరల్ (ఏ అండ్ ఈ)లో 50 పోస్టులు, ఆఫీస్ ఆఫ్ ది ప్రొబెషన్ డైరక్టర్ ఆఫ్ ఆడిట్, ఎస్ఈసిఆర్, బిస్లాపూర్లో 13 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి 5200 నుంచి 20200 వరకు వేతన స్కేలును చెల్లిస్తారు.
కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు కాగా, గరిష్ట వయస్సు 27 సంవత్సరాలుగా నిర్ధారించారు. అన్ని పోస్టులకు తగిన అనుభవం కలిగి, పదోతరగతి ఉత్తీర్ణులై ఉంటే చాలు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 25వ తేదీలోపు ఆఫీస్ ఆఫ్ ది అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) ఛత్తీస్గఢ్, పగారియా కాంప్లెక్స్, న్యూ బస్ స్టాండ్, పండ్రి, రాయ్పూర్ (చత్తీస్గఢ్), పిన్కోడ్ 492004 అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది.