హైదరాబాదుకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ (ఐపీఈ) ఉస్మానియా క్యాంపస్ వారు వివిధ రకాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశానికై దరఖాస్తులను కోరుతున్నారు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం), పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్-రిటైల్ అండ్ మార్కెటింగ్ (పీజీడీఎం-ఆర్ఎం) మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మేనేజ్మెంట్-బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (పీజీడీఎం-బీఐఎఫ్) కోర్సులలో చేరగోరు ఆసక్తిగల అభ్యర్థులు 50 శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
కాగా, అభ్యర్థుల ఎంపిక మాత్రం క్యాట్ స్కోర్ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు చేయాలనుకున్నవారు... "అడ్మిషన్ ఆఫీసర్, ఓయు క్యాంపస్, ఐపీఈ" నుండి స్వయంగా దరఖాస్తు ఫారాలను పొందవచ్చు. లేదా, "ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్" పేరుతో హైదరాబాద్లో చెల్లే విధంగా తీసిన 800 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ను పంపి దరఖాస్తులను పోస్టులో పొందవచ్చు, లేదా... ఐపీఈ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పూర్తి చేసిన దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేది డిసెంబర్ 8, 2008. మరిన్ని వివరాల కోసం డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.ఐపీఇండియా.ఆర్గ్ వెబ్సైట్ను సందర్శించండి.