మార్కెటింగ్, ఆపరేషనల్ ఫంక్షన్స్ కోసం ఆఫీసర్ ట్రైనీల నియామకానికి స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియూ లిమిటెడ్ (ఎస్హెచ్సీఐఎల్) ప్రకటన విడుదల చేసింది. ప్రథమ శ్రేణిలో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 24 సంవత్సరాలకు మించరాదు. ఈ పోస్టుకు ఎంపికయ్యే అభ్యర్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, ఆంగ్ల భాషలో ప్రావీణ్యం, కంప్యూటర్ నాలెడ్జ్ విధిగా కలిగి ఉండాలి.
ఎంపికయ్యే అభ్యర్థులకు శిక్షణా కాలంలో నెలకు రూ.11 వేల చొప్పున పారితోషికం చెల్లిస్తారు. శిక్షణా కాలాన్ని విజయువతంగా పూర్తి చేసిన అనంతరం రూ.2.17 లక్షల వార్షిక వేతనం చెల్లిస్తారు. ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేవారు డిసెంబర్ 4వ తేదీ గడువు తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్హెచ్సిఐఎల్.కామ్లో చూడొచ్చు.