Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"ఎల్‌పీ సెట్ 2008" ఉమ్మడి ప్రవేశ పరీక్ష

Advertiesment
కెరీర్ అవకాశాలు భాషా పండితులు శిక్షణ కోర్సు ప్రవేశం ఉమ్మడి పరీక్ష ప్రకటన ప్రభుత్వం జారీ నియమాలు భారతీయ అభ్యర్థి
, సోమవారం, 3 నవంబరు 2008 (13:46 IST)
భాషా పండితుల శిక్షణా కోర్సు (ఎల్‌పీ సెట్ 2008-09)లో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షకుగానూ ప్రకటన వెల్లడైంది. ప్రభుత్వం జారీ చేసిన నియమాల మేరకు... భారతీయ అభ్యర్థుల నుండి 2008-2009 విద్యా సంవత్సర కాలంలో ప్రభుత్వ సిటిఇలు/ఐఎఎస్ఇలు మరియు రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు భాషా పండితుల శిక్షణా సంస్థల్లో ఆఫర్ చేస్తున్న ఒక సంవత్సరం శిక్షణా కోర్సులో ప్రవేశం కొరకు అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు.

దరఖాస్తులు దాఖలు చేయు అభ్యర్థులు... తెలుగు పండిట్ కయితే, బిఎ తెలుగు సాహిత్యం లేదా బిఎ ప్రాచ్య సాహిత్యం లేదా బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజీ తెలుగు లేదా తెలుగు ఐచ్చిక పాఠ్యాంశంగా గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా ఎంఎ తెలుగు చదివి ఉండాలి.

హిందీ పండిట్ చేయగోరు వారైతే... ఐచ్చిక పాఠ్యాంశం హిందీతో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజి హిందీ లేదా హైదరాబాద్, దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి ప్రవీణ లేదా హైదరాబాద్ హిందీ ప్రచార సభ వారి విద్వాన్ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన బీఏ స్థాయి హిందీలో ఏదైనా ఇతర తత్సమాన అర్హత లేదా, ఎంఏ హిందీ చదివి ఉండాలి.

ఉర్దూ పండిట్... బిఏ ఉర్దూ సాహిత్యం లేదా బిఏ ప్రాచ్య భాష ఉర్దూ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజీ ఉర్దూ లేదా ఉర్దూ ఐచ్చిక పాఠ్యాంశంగా గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా ఎంఏ ఉర్దూ చదివి ఉండాలి.

దరఖాస్తు చేసే అభ్యర్థులు 2008 జూలై 1వ తేదీ నాటికి 19 సంవత్సరాల వయస్సు పూర్తయిన వారై ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రధాన తపాలా కార్యాలయాలు, ఇ-సేవా కేంద్రాల నుండి దరఖాస్తు ఫారాలను స్వయంగా పొందవచ్చు. పరీక్ష రుసుముతో సహా దరఖాస్తు పత్రం ధర 150 రూపాయలు మాత్రమే.

దరఖాస్తు ఫారాల అమ్మకానికి ఆఖరు తేదీ నవంబర్ 25, 2008. కాగా, పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలు, జత చేయాల్సిన అన్ని పత్రాలతో పాటుగా... ప్రభుత్వ డిఐఇటి కార్యాలయం లేదా అభ్యర్థులు ఏ జిల్లాలో హాజరు కాగోరుచున్నారో ఆ జిల్లాలో సంబంధిత ప్రభుత్వ డిఐఇటి ప్రిన్సిపాల్ గుర్తించిన ప్రదేశంలో నవంబర్ 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు సెలవు రోజులతో సహా ఉదయం పదిన్నర నుండి సాయంత్రం 5 గంటలలోపు స్వయంగా దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీ : 14-12-2008 ఆదివారం. తెలుగు పండిట్- 14వ తేదీ ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, హిందీ పండిట్- ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం 12 వరకు, ఉర్దూ పండిట్- మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడున్నర గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయి.

Share this Story:

Follow Webdunia telugu