2009-10 విద్యా సంవత్సరానికి గాను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ (ఎన్.ఐ.ఐ) కేంద్రం పీహెచ్డి ప్రోగ్రామ్స్కు నోటిఫికేషన్ జారీ చేసింది. కెమికల్ బయాలజీ, జెనెటిక్స్, సెల్ సిగ్నలింగ్, ఇమ్యూనిటీ అండ్ ఇన్ఫెక్షన్, మాలిక్యులర్ అండ్ సెల్యులర్ బయాలజీ, రీ ప్రొడక్షన్ అండ్ డెవలప్మెంట్, స్ట్రక్చరల్ అండ్ కంప్యూటేషనల్ బయాలజీ విభాగాల్లో పీహెచ్డీ ప్రోగ్రామ్స్ చేసే అర్హులైన పరిశోధకులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇందుకోసం అభ్యర్థులు ఎమ్మెస్సీ (బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్) లేదా ఎంటెక్, ఎంబీబీఎస్, ఎవీఎస్సీ, ఎంఫార్మ్ లేదా న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జె.ఎన్.యు)చే గుర్తించబడిన సమానమైన విద్యార్హతను కలిగివుండాలి. వచ్చే ఏడాది జులై 15వ తేదీ నుంచి ఈ కోర్సు తరగతులు ప్రారంభమవుతాయి. ఈ పీహెచ్డి ప్రోగ్రామ్కు ఎంపికయ్యే పరిశోధకులకు నెలకు 12000 నుంచి 14000 వరకు ఫెలోషిప్ స్టైఫండ్ను అందజేస్తారు.
దరఖాస్తులతో పాటు వంద రూపాయల విలువ చేసే, ఆరు నెలల కాలపరిమితిలో చెల్లుబాటయ్యే డిడిని తీసి జతచేయాల్సి వుంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులు మాత్రం రూ.యాభైతో కూడిని డిమాండ్ డ్రాఫ్ట్ను పంపాలి. డీడీని "మేనేజర్ (ఏ అండ్ ఇ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ, అరుణ్ అసిఫ్ అలీ మార్గ్, న్యూఢిల్లీ - 110067" అనే చిరునామా మీద తీయాల్సి వుంటుంది.
ఫిబ్రవరి 15న ప్రవేశ పరీక్ష
కాగా, ఈ కోర్సుకు అర్హులైన ఔత్సాహిక అభ్యర్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేశారు. ఈ ప్రవేశ పరీక్ష వచ్చే ఫిబ్రవరి 15వ తేదీ నిర్వహిస్తారు. రాత టెస్ట్ ఫలితాన్ని ఫిబ్రవరి 20వ తేదీ వెల్లడిస్తారు. ఫలితాలను ఇనిస్టిట్యూట్ వెబ్సైట్లోనూ చూడొచ్చు. ఇంటర్వ్యూలు జూన్ నెల నాలుగు ఏడు తేదీల మధ్య జరుగుతుంది. రాతపరీక్షకు, ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమ సొంత ఖర్చులతో న్యూఢిల్లీకి వెళ్లాల్సి వుంటుంది.