హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 122 పోస్టులకు గాను జనరల్ కేటగిరీ కింద 68, ఓబీసీ విభాగంలో 30, ఎస్సీలో 13, ఎస్టీలో 7, పీహెచ్సీలో 4 చొప్పున పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు కనీసం 65 శాతం (ఎస్సీ/ఎస్టీలు 55 శాతం) మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2010 అక్టోబర్ 31 నాటికి 25 ఏళ్లు (ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ళ వయో సడలింపు) ఉండాలి.
ఈ దరఖాస్తులను ఈనెల 22వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. వీటిని డిసెంబరు నాలుగో తేదీ నాటికి పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఈసీఐఎల్.కొ.ఇన్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.