ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ)లో డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.
ఏపీఎస్ఆర్టీసీ సంస్థలోని డ్రైవర్, కండక్టర్ పోస్టుల భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా డ్రైవర్ పోస్టులు 2,404, కండక్టర్ పోస్టులు 2,528 మందిని నియమించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య శుక్రవారం అనుమతించారు.
వీటితోపాటు మరో 23 వేల పోస్టులు గ్యారేజీ తదితర విభాగాలలో భర్తీ చేసేందుకు ప్రక్రియ మొదలవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.